Sunday, December 25, 2011

jesus





Thursday, December 8, 2011

లింగాష్టకం యొక్క అర్దం ఏమిటి?

బ్రహ్మ మురారి సురార్చిత లింగం
బ్రహ్మ , విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం

నిర్మల భాషిత శోభిత లింగం
నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం

జన్మజ దుఃఖ వినాశక లింగం
జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం
ఓ సదా శివ లింగం నీకు నమస్కారం !

దేవముని ప్రవరార్చిత లింగం
దేవమునులు , మహా ఋషులు పూజింప లింగం

కామదహన కరుణాకర లింగం
మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం

రావణ దర్ప వినాశక లింగం
రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం

తత్ ప్రణమామి సద శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!

సర్వ సుగంధ సులేపిత లింగం
అన్ని మంచి గంధాలు , మంచి గా పూసిన శివ లింగం

బుద్ధి వివర్ధన కారణ లింగం
మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం .

సిద్ధ సురాసుర వందిత లింగం
సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివ లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!

కనక మహామణి భూషిత లింగం
బంగారు , మహా మణుల చేత అలంకరింప బడ్డ శివ లింగం

ఫణిపతి వేష్టిత శోభిత లింగం
నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివ లింగం

దక్ష సుయజ్ఞ వినాశక లింగం
దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!

కుంకుమ చందన లేపిత లింగం
కుంకుమ , గంధము పూయబడ్డ శివ లింగం

పంకజ హార సుశోభిత లింగం
కలువల దండ చేత చక్కగా అలంకరింప బడ్డ శివ లింగం

సంచిత పాప వినాశక లింగం
సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!

దేవగణార్చిత సేవిత లింగం
దేవ గణాల చేత పూజింప బడ్డ , సేవించ బడ్డ శివ లింగం

భావైర్ భక్తీ భిరేవచ లింగం
చక్కటి భావం తో కూడిన భక్తీ చేత పూజింప బడ్డ శివ లింగం

దినకర కోటి ప్రభాకర లింగం
కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి శివ లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!

అష్ట దలోపరి వేష్టిత లింగం
ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం

సర్వ సముద్భవ కారణ లింగం
అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం

అష్ట దరిద్ర వినాశక లింగం
ఎనిమిది రకాల దరిద్రాలను (అష్ట దరిద్రాలు) నాశనం చేసే శివ లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!

సురగురు సురవర పూజిత లింగం
దేవ గురువు (బృహస్పతి), దేవతల చేత పూజింప బడ్డ శివ లింగం

సురవన పుష్ప సదార్చిత లింగం
దేవతల తోటల్లో పూచే పువ్వులు (పారిజాతాలు) చేత ఎప్పుడూ పూజింప బడే శివ లింగం

పరమపదం పరమాత్మక లింగం
ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గము

తత్ ప్రణమామి సదా శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!

లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ
ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో , వారికి చాలా పుణ్యం వస్తుంది

శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే
శివ లోకం లభిస్తుంది (శివుడి లో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది)

అబౌట్ అయ్యప్ప స్వామి

అయ్యప్పను గురించిన ప్రధాన గాధలు
అయ్యప్ప హిందూ దేవతలలో ఒకడు. ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. బరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు.
మహిషి కధనం
మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విదంగా కోరింది. శివుడికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. 'తధాస్తు' అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ.
అయ్యప్ప జననం
క్షీరసాగరమధనం అనంతరం దేవతలకు, రాక్షసుల కు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం దరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త.

అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ వీరపాండ్య చక్రవర్తి, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. ఒంటరిగా వున్న, అమిత తేజోసంపన్నుడైన బాలుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు. అతని తల్లితండ్రులెవరైనా వున్నారేమో అని అడవంతా గాలిస్తాడు. ఎక్కడా ఆచూకీ దొరక్క పోవడంతో సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడ ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. ఆ బాలుడు చిన్నప్పుడే ఎన్నో మహిమలతో అందర్నీ ఆశ్చక్యచకితులను చేస్తాడు. పులిని వాహనంగా చేసుకుని తిరుగుతూ, ఘోరమైన ఆపదలలో చిక్కుకున్న వారిని అతిధైర్యంతో, సాహసోపేతమైన యుద్ధాలతో రక్షిస్తూ పాండ్యచక్రవర్తికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తాడు. అతి ప్రమాదకరమైన విషజంతువులన్నీ అతనికి లొంగిపోయి, అణిగిమణిగి వుంటాయి.

మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా' అని మరికొందరు 'అప్పా' అని మరికొందరు రెండు పేర్లూ కలిపి 'అయ్యప్ప' అని పిలిచేవారు. 'అయ్యా' అంటే తండ్రి, 'అప్ప' అంటే అన్న అని అర్థాలు వుండటం చేత ఒక పెద్ద అన్నగా, తండ్రిగా ఆ రాజ్యం మొత్తానికే 'అయ్యప్ప స్వామి'గా భావింపబడ్డాడు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులం లో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేఖ తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాది తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.
మహిషి వధ
అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మద్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.
శబరిమలైలో నివాసం
రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని రాజ్యాధికారం మీద, భోగభాగ్యాల మీద ఏ మాత్రం మమకారం లేదనీ, వీరపాండ్యచక్రవర్తికీ, ఆయన పట్టమహిషికీ పుట్టిన పట్టికే పట్టాభిషేకం చేయడం ధర్మం అని చెప్పి చక్రవర్తిని ఒప్పిస్తాడు. తాను ఎక్కడ నుండి వచ్చాడో అక్కడికే వెళ్లి తపస్సు చేసుకుంటాననీ, తనను శరణుకోరి వచ్చే భక్తులను సదా కాపాడుతూ వుంటాననీ పాండ్యరాజుకి వాగ్దానం చేస్తాడు. అయ్యప్ప స్వామి ధర్మప్రవర్తన, ధర్మనిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏయే ధర్మాలని పాటించాలో, ఏ నియమనిష్ఠలతో వుండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన 'ధర్మశాస్త'గా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.
అందుకే ఆయనకి 'ధర్మశాస్త' అనే పేరు కూడా వుంది. తనకు వాహనంగా వున్న వ్యాఘ్రం (పులి) ఎక్కడ వున్నప్పటికీ తన యజమానిని గుర్తించడానికి వీలుగా మణికంఠ హారాన్ని నిత్యం ధరిస్తూ వుంటాడనీ, అందుచేత 'మణికంఠ' అని కూడా భక్తులు పిలుస్తారనీ కొందరి అభిప్రాయం! ఈ విధంగా, యుగాలు మారుతున్నా, మనుషులు మారుతున్నా, అభిరుచులు మారుతున్నా, 'అయ్యప్పస్వామి' తమ తండ్రి కాని తండ్రి పెంపుడు తండ్రి అయిన పాండ్యరాజుకిచ్చిన వాగ్దానాన్ని ఈ నాటికీ, సదా నిలబెట్టుకుంటూనే వున్నాడు.

బాల్యంలోనే మహాజ్ఞానసంపన్నుడై సకలదేవతల అంశలనీ తనలో ఇముడ్చుకున్నాడు. నవగ్రహాల ప్రభావం మానవలోకంలో దుష్ప్రభావం చూపించకుండా, శని, రాహు, కేతు మొదలైన గ్రహాల వల్ల ఆపదలు రాకుండా సదా కాపాడే మహిమాన్వితమైన దైవం అయ్యప్ప స్వామి!! తన భక్తులను శనిప్రభావం కలిగించనని 'శని' గ్రహం అయ్యప్పకు వాగ్దానం చేస్తాడు, అందుకు అయ్యప్ప మానవులకు శనికి ప్రీతిపాత్రమైన నల్లని దుస్తులను తన దీక్షాకాలంలో ధరించాలని నియమం పెట్టాడు. దీక్షా సమయంలో ఒకసారి నల్లని దుస్తులను ధరించినవారికి జీవితాంతం శని ప్రభావం వుండదని 'అయ్యప్ప' తన భక్తులకు తెలియజేశాడు. అది రుజువవుతోంది.

అందుకే అయ్యప్పస్వామి దీక్షాపరులు అధికసంఖ్యలో శబరిమలై తరలి వెడుతున్నారు. జీవితసమస్యలు పరిష్కారం కావడానికీ, కోరికలు సిద్ధించడానికీ, 'అయ్యప్ప దీక్ష'ను మించినది లేదు!!
ఒక సంవత్సరకాలంలో కనీసం 'మండలదీక్ష' (41 రోజులు) నిష్ఠగా పాటిస్తూ దురలవాట్లకీ, వ్యసనాలకీ దూరంగా వుంటూ సంసారబంధాల నుండి బయిటికి వచ్చి నిత్యనామస్మరణతో తనను ఆరాధించే వారికి జీవితాంతం సుఖసంతోషాలు కలిగిస్తూ ఆపదలు తొలగిస్తూ ఆదుకుంటానని చెప్పి భక్తుల పాలిటి కల్పవృక్షమై అభయాన్ని ప్రసాదిస్తున్నాడు. స్వామి దీక్షాపరులకు అనేక దివ్యమైన అనుభూతులు, అనుభవాలు కలుగుతున్నాయి.

శా: అయ్యప్పగన్ గడు భక్తితో కొలచినన్ ఆహ్లాదమానందమై
అయ్యా దీక్షను బట్టి కోర్కెలు, సమస్యల్ దీరు, సిద్ధించు, సా
హాయ్యం చెంతయు పొంది తీరు, జను లత్యంతానుమోదంబుతో
నెయ్యంబున్ సహకారమున్ గఱపుచున్, నిష్ఠాత్ములై యొప్పెడిన్!!
శరణాగత రక్షకుడైన శ్రీ అయ్యప్ప స్వామివారి దివ్యాతి దివ్యమైన చరిత్ర సంపూర్ణం.

Wednesday, December 7, 2011

అష్టోత్తర శతనామవళి

ఓం మహాశస్త్రే నమః
ఓం మహాదేవసుతాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం లోకకర్త్రే నమ:
ఓం లోకహర్త్రే నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం త్రిలోకరక్షకాయ నమః
ఓం ధన్వినే నమః
ఓం తపస్వినే నమః
ఓం భూతసైనికాయ నమః
ఓం మంత్రవేదినే నమః
ఓం మహావేదినే నమః
ఓం మారుతాయ నమః
ఓం జగదీశ్వరాయ నమః
ఓం లోకాధ్యక్షాయ నమః
ఓం అగ్రగన్యే నమః
ఓం శ్రీమతే నమః
ఓం అప్రమేయపరక్రామాయ నమః
ఓం సింహారూధాయ నమః
ఓం గజారూధాయ నమః
ఓం గయారూఢాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం నానావస్త్రధరాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నానావిద్యావిశారదయ నమః
ఓం వీరాయ నమః
ఓం భూతేశాయ నమః
ఓం భృతిదాయ నమః
ఓం భుజంగాభరణోత్తమాయ నమః
ఓం ఇక్షుధనినే నమ:
ఓం పుష్పబాణాయ నమః
ఓం మహారూపాయ నమః
ఓం మహాప్రభవే నమః
ఓం మాయాచేవీసుతాయ నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాన్వితాయ నమః
ఓం మహాగుణాయ నమః
ఓం మహాకృపాయ నమః
ఓం మహారుద్రాయ నమః
ఓం వైష్ణవాయ నమః
ఓం విష్ణుపూజకాయ నమః
ఓం విఘ్నేశ్వరాయ నమః
ఓం వీరభద్రేశాయ నమః
ఓం భైరవాయ నమ:
ఓం షణ్ముఖధృవాయ నమః
ఓం మేరుశృంగ నమః
ఓం సమాసీనాయ నమః
ఓం మునిసంఘనిషేవితయ నమః
ఓం దేవాయ నమ:
ఓం భద్రాయ నమః
ఓం జగన్నాదాయ నమః
ఓం గణనాదాయ నమః
ఓం గణేశ్వరాయ నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహామాయినే నమః
ఓం మహజ్ఞానినె నమః
ఓం మాహాస్థిరాయ నమః
ఓం దేవశాస్త్రే నమః
ఓం భూతశాస్త్రే నమః
ఓం నాగరాజాయ నమః
ఓం నాగకేశాయ నమః
ఓం వ్యోమకేశాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం సగుణాయ నమః
ఓం నిర్గుణాయ నమః 

హరివరాసనం విశ్వమోహనం

అయ్యప్ప పూజ చివరిలో "హరివరాసనం" గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసే ముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను, పూజలలోను పాటిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని "కుంబకుడి కులతూర్ అయ్యర్" రచించాడు. 1955లో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు. 1940, 50 దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో వి. ఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివశిస్తూ ఉండేవాడు. మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ అరణ్య ప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు. అప్పట్లో "ఈశ్వరన్ నంబూద్రి" అనే అర్చకుడు ఉండేవాడు. తరువాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్ళిపోయాడు. అతను మరణించాడని తెలిసినపుడు చింతించిన ఈశ్వరన్ నంబూద్రి ఆరోజు ఆలయం మూసివేసే సమయంలో "హరివరాసనం" స్తోత్రం చదివాడు. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.

హరవరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్కదీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క రాత్రిదీపం మాత్రం ఉంచుతారు. ఈ శ్లోకం నిద్రపోయేముందు అయ్యప్పకు జోలవంటిది. శ్లోకం అయిన తరువాత నమస్కారం చేయవద్దని, "స్వామి శరణు" అని చెప్పుకోవద్దని చెబుతారు.
ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి.
హరివరాసనం విశ్వమోహనం - హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం
అరివిమర్ధనం నిత్యనర్తనం - హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

శరణకీర్తనం శక్తమానసం - భరణలోలుపం నర్తనాలసం
అరుణభాసురం భూతనాయకం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
ప్రణయసత్యకం ప్రాణనాయకం - ప్రణతకల్పకం సుప్రభాంచితం
ప్రణవమనీద్రం కీర్తనప్రియం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

తురగవాహనం సుందరాననం - వరగధాయుధం వేదవర్ణితం
గురుకృపాకరం కీర్తనప్రియం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

త్రిభువనార్చితం దేవతాత్మకం - త్రినయనం ప్రభుం దివ్యదేశికం
త్రిదశపూజితం చింతితప్రదం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

భవభయాపహం భావుకావహం - భువనమోహనం భూతిభూషణం
ధవళవాహనం దివ్యవారణం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

కళమృదుస్మితం సుందరాననం - కలభకోమలం గాత్రమోహనం
కలభకేసరి వాజివాహనం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

శ్రితజనప్రియం చింతితప్రదం - శృతివిభూషణం సాధుజీవనం
శృతిమనోహరం గీతలాలసం - హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

లోకవీరం మహా పూజ్యం

లోకవీరం మహా పూజ్యం
సర్వ రక్షాకరం విభుం
పార్వతీ హృదయానందం
శాస్తారం ప్రణమామ్యహం
స్వామియే శరణం అయ్యప్ప !!!

విప్రపూజ్యంవిశ్వవంద్యం
విష్ణు శంభో శివం సుతం
క్షిప్ర ప్రసాద నిరతం
శాస్తారం ప్రణమామ్యహం
స్వామియే శరణం అయ్యప్ప !!!

మత్తమాతంగగమనం
కారున్యామృత పూరితం
సర్వ విఘ్న హారం దేవం
శాస్తారం ప్రణమామ్యహం
స్వామియే శరణం అయ్యప్ప !!!

అస్మత్ కులేస్వరం దేవం
అస్మత్ శత్రు వినాశనం
అస్మదిష్ట ప్రదాతారం
శాస్తారం ప్రణమామ్యహం
స్వామియే శరణం అయ్యప్ప !!!

పాంద్యేశవంశతిలకం
కేరలేకేళివిగ్రహం
ఆర్తత్రాణవరందేవం
శాస్తారం ప్రణమామ్యహం
స్వామియే శరణం అయ్యప్ప !!!

పంచ రత్నఖ్య మేతద్యో
నిత్యం స్తోత్రం పటేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్
శాస్తా వసతి మానసే
స్వామియే శరణం అయ్యప్ప !!!

భూతనాథ సదానంద
సర్వ భూత దయాపర
రక్ష రక్ష మహా బాహొ
శాస్తే తుభ్యం నమో నమః
స్వామియే శరణం అయ్యప్ప !!!

శబరిపర్వతేపూజ్యం
శాంత మానస సంస్థితం
భక్తౌశు పాప హన్తారం
అయ్యప్పన్ ప్రణమామ్యహం
స్వామియే శరణం అయ్యప్ప !!!

పడి పాట

స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప
హరి హర సుతనే శరణం పొన్నయ్యప్ప

ఎరుమేలి శాస్త శరణం పొన్నయ్యప్ప
పేట్టైతుళ్ళి శరణం పొన్నయ్యప్ప

వావరు స్వామియే శరణం పొన్నయ్యప్ప
కాలైకట్టి ఆశ్రమమే శరణం పొన్నయ్యప్ప

అలుద నదియె శరణం పొన్నయ్యప్ప
అలుదై స్నానమే శరణం పొన్నయ్యప్ప

కరిమల తోడే శరణం పొన్నయ్యప్ప
కరిమల ఎట్రమే శరణం పొన్నయ్యప్ప

కరిమల గర్భ స్వామి శరణం పొన్నయ్యప్ప
పంబా నదియె శరణం పొన్నయ్యప్ప

పంబై స్నానమే శరణం పొన్నయ్యప్ప
నీలి మలై ఎట్రమే శరణం పొన్నయ్యప్ప

అప్పాచ్చి మేడే శరణం పొన్నయ్యప్ప
కాంతి మలై జ్యోతియే శరణం పొన్నయ్యప్ప

శబరి పీ త మే శరణం పొన్నయ్యప్ప
శబరికి ముక్తి శరణం పొన్నయ్యప్ప

అగ్ని గుండమే శరణం పొన్నయ్యప్ప
మకర జ్యోతియే శరణం పొన్నయ్యప్ప

స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప
హరి హర సుతనే శరణం పొన్నయ్యప్ప

స్వామి శరణం అయ్యన శరణం అయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప
ఒకటవ మెట్టు శరణం పొన్నయ్యప్ప
రెండవ మెట్టు శరణం పొన్నయ్యప్ప
మూడవ మెట్టు శరణం పొన్నయ్యప్ప
స్వామి శరణం అయ్యన శరణం అయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప
నాల్గవ మెట్టు శరణం పొన్నయ్యప్ప
ఐదవ మెట్టు శరణం పొన్నయ్యప్ప
ఆరవ మెట్టు శరణం పొన్నయ్యప్ప
స్వామి శరణం అయ్యన శరణం అయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప
సశేషం....

సత్యము జ్యోతిగ వెలుగునయా

సత్యము జ్యోతిగ వెలుగునయా
నిత్యము దానిని చూడుమయా
పరుగున మీరు రారయ్యా
శబరి గిరికి పోవుదము

శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శబరి గిరీశా అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్ప
గురు స్వామియే శరణం అయ్యప్ప

హరిహర మానస సుతుడైన
సురల మొరలను ఆలించి
భువిలో తాను జనియించి
పడునాల్గేండ్లు వసియించి

ఘోరా తడవిలో బాలునిగా
సర్పము నీడలో పవళించి
వేటకు వచ్చిన రాజునకు
పసి బాలునిగా కనిపించి

మనికంట అను
నామముతో
పెంచిరి బాలుని మురిపెముగా
స్వామి మీ మహిమలతో
రాజుకు కలిగెను సుతుడొకడు

గురువాసంలో చదివించి
గురు పుత్రున్ని దీవించి
మాటలు రాని బాలునకు
మాటలు వచ్చెను మహిమలతో

మాతా పితలను సేవించి
మహిషి ని తాను వధియించి
శబరి గిరిలో వేలిసిరి గా మనలను ధన్యుల జేయుటకు
అయ్యప్పా అను నామముతో

శిలా రూపమున తానున్నా
జ్యోతి స్వరూపా మహిమలతో
భక్తుల కోర్కెలు దీర్తురయా

మార్గశిరాన మొదలెట్టి
నలుబది దినముల దీక్షతో
శరణుని భజనలు చేయుచునూ
ఇరుముడి కట్టి పయనించి

భోగికి ముందు చేరాలి
మకర సంక్రాంతి చూడాలి
చాలు చాలు మనకింకా
వలదు వలది ఇక జన్మ

మకర సంక్రాంతి దినమున
సాయం సమయం వేళలో
సర్వం వదిలిన సత్పురుషులకు జ్యోతిగా దర్శన మిచ్చేదరు

పాలాభిషేకం స్వామీకి
నేయ్యాభిషేకం స్వామీకి
తేనాభిషేకం స్వామీకి
పూలాభిషేకం స్వామీకి
కర్పూర హారతి తనకెంతో

పాయసమంటే మరి ఎంతో
శరణన్న పదము ఎంతెంతో
ఇష్టం ఇష్టం స్వామికి

హరివరాసనం స్వామీది
సుందర రూపం స్వామీది
కనుల పండుగ మనకేలే
జన్మ తరించుట మనదేలే

శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం శరణ మయా
శరణం శరణం మా స్వామి
నీ దరికి జేర్చుకో మా స్వామి